Spread the love

తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది టెట్ (తెలంగాణ టెచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగిత ఈ ఫలితాలను వెల్లడించారు. జ‌న‌వ‌రి 2 నుంచి 20 వ‌ర‌కు నిర్వహించిన ఈ పరీక్షకు 1,35,802 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో 42,384 మంది (31.21 శాతం) అర్హత సాధించారు.

తెలంగాణ టెట్‌లో రెండు పేపర్లు ఉంటాయి. 1 నుంచి 5 తరగతుల వరకూ ఉపాధ్యాయులుగా ఎంపిక కావాలనుకునే అభ్యర్థులు పేపర్-1ను, 6 నుంచి 8 తరగతుల వరకు ఉపాధ్యాయులుగా పని చేయాలనుకునే వారు పేపర్-2ను ఎంపిక చేసుకుంటారు.

అభ్యర్థుల ప్రతిభను అంచనా వేసేందుకు నిర్వహించిన ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు టీచర్ ఉద్యోగాలకు అర్హత పొందారు. టెట్ పరీక్షలో పొందిన మార్కులు టీచర్ ఉద్యోగాల భర్తీలో ప్రామాణికంగా పరిగణలోకి తీసుకోబడతాయి.

తెలంగాణ ప్రభుత్వం కూడా ఇకపై ప్రతి సంవత్సరం టెట్‌ను నిర్వహించేందుకు నిర్ణయం తీసుకుంది, ఇది భవిష్యత్తులో టీచర్ ఉద్యోగాల భర్తీలో కీలక పాత్ర పోషించనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights