Spread the love

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాష్ట్రంలో రైతుల పరిస్థితిపై తీవ్రంగా స్పందించారు. “లక్షల్లో అప్పులు, రోజుకో ఆత్మహత్య, రైతుల బలవన్మరణాల్లో మూడో స్థానం, ఇదీ మన రాష్ట్రంలో రైతుల దుస్థితి” అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

షర్మిల మాట్లాడుతూ, “ప్రభుత్వాలు మారినా రైతుల తలరాతలు మాత్రం మారడంలేదు” అని అన్నారు. “వైఎస్సార్ పాలనలో రాష్ట్రం అన్నపూర్ణగా పేరొందింది. ఆ సమయంలో పంట దిగుబడుల్లో రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచింది. కానీ ఇప్పుడు, గిట్టుబాటు ధరలు లేక రైతులు అల్లాడుతున్నారు” అని ఆమె వివరణ ఇచ్చారు.

షర్మిల తన వ్యాఖ్యల్లో “గత పదేళ్లుగా రైతులకు ప్రభుత్వాలు మాయమాటలు చెబుతూనే ఉన్నాయి” అని అన్నారు. “చంద్రబాబు మొదటి ఐదేళ్లుగా రూ.5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి అంటూ మాట తప్పారు. ఆ తర్వాత జగన్ రూ.3 వేల కోట్లతో మోసం చేశార” అని ఆమె ఆరోపించారు. “రైతులు ప్రభుత్వాల మాటలు వినిపిస్తూ తప్పు చేశారని” ఆమె తెలిపారు.

“రాష్ట్రంలో వరి ధాన్యానికి బస్తాకు రూ.1,400 మించి ధర పలకడం లేదు… పత్తి ధర రూ.12 వేల నుంచి రూ.6 వేలకు పడిపోయింది. మిర్చి ధర రూ.23 వేలు నుంచి రూ.11 వేల కంటే ఎక్కువగా లేదు. కంది ధర రూ.10 వేల నుంచి రూ.7 వేలకు పడిపోయింది” అని రైతుల నష్టాలను వివరించారు.

“రాష్ట్రంలో 55 లక్షల మంది రైతులకు గిట్టుబాటు ధర కల్పించేలా ఏడాదికి రూ.5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని తక్షణమే ఏర్పాటు చేయండి” అని “గతంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోండి” అని డిమాండ్ చేశారు.

“అన్నదాత సుఖీభవ పథకంలో ఇచ్చామన్న రూ.20 వేల సాయాన్ని వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని” షర్మిల పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూటమి ప్రభుత్వాన్ని “రైతుల సంక్షేమానికి దృష్టి పెట్టాలని” ఆమె పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights