Spread the love

“డాక్టర్ వంశీకృష్ణ, ప్రతిభ దంపతుల 1 కోటి విరాళం:

అమరావతి: పల్నాడు జిల్లా, అమరావతి మండలం, అత్తులూరు గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ దంపతులు డాక్టర్ సూరపనేని వంశీకృష్ణ, డాక్టర్ ప్రతిభ సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలసి బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణానికి రూ.1 కోటి విరాళం అందించారు.

ఈ సందర్భంగా, పేదల వైద్యం కోసం వారి ఘనమైన సమర్పణను అభినందిస్తూ సీఎం చంద్రబాబు నాయుడు వారు ముందుకు వచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, రాజధాని అమరావతి నిర్మాణంలో ఎన్ఆర్ఐలు మరిన్ని విరాళాలు ఇవ్వాలని, రాజధాని అభివృద్ధిలో తమ పాత్రను గుర్తించాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ చెక్కును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హిందూపురం ఎమ్మెల్యే, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్ బాలకృష్ణ గారికి తన చేతులమీదుగా అందజేయనున్నారు.

ఈ సమావేశంలో డాక్టర్ ప్రతిభతో పాటు ఆమె తండ్రి నూతలపాటి సురేంద్రబాబు, కుటుంబ సభ్యులు, ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ తదితరులు కూడా పాల్గొన్నారు.

“పేదల వైద్య సేవల్లో పెద్ద మనసుతో సహకరించిన వంశీకృష్ణ, ప్రతిభ దంపతులకు సీఎం అభినందనలు!”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights