Spread the love

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, విజయవాడలోని 35వ బుక్ ఫెస్టివల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “నేను కోరుకున్న చదువు పుస్తకాల్లో కానీ, క్లాస్‌రూంలో కానీ లేదు. అందుకే ఇంటర్‌తో చదువు ఆపేశాను” అని వెల్లడించారు.

పవన్ కల్యాణ్ ఆహ్వానించిన ఈ సభలో, పుస్తకాలు చదవడం ద్వారా ఉపాధ్యాయుల అవసరం కూడా తగ్గిపోతుందని వ్యాఖ్యానించారు. “ఇంటర్‌తోనే చదువు ఆపేశాను, కానీ పుస్తకాలను చదవడం మాత్రం ఆపలేదని” చెప్పారు.

తాను చదువుకోలేకనో, లేక మార్కులు తెచ్చుకోలేకనో చదువు ఆపలేదని పవన్ కల్యాణ్ తెలిపారు. “నిజంగా బాగా చదివేవాడిని, కానీ నేను కోరుకున్న చదువు పుస్తకాల్లోనే ఉండేదని” పేర్కొన్నారు.

ఆయన వాఖ్యానించిన విధంగా, “రవీంద్రనాథ్ ఠాగూర్ స్కూల్‌కు వెళ్లకుండానే ఇంటివద్ద నేర్చుకున్నాడు” అని గుర్తు చేస్తూ, ఆయన ప్రేరణతో తన బాటలో సాగినట్లు చెప్పారు.

తనకు పుస్తక పఠనం అలవాటైనది తల్లిదండ్రుల వల్లే అని పవన్ కల్యాణ్ తెలిపారు. “నేను ఎక్కడైనా కోటి రూపాయలు ఇవ్వాలని ఆలోచించను, కానీ పుస్తకం ఇవ్వాలంటే మాత్రం ఆలోచిస్తాను. ఎవరికైనా నా పుస్తకం ఇవ్వాలంటే అది సంపద మొత్తం ఇచ్చినట్లుగా ఉంటుంది” అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights